calender_icon.png 12 June, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బులు చెల్లించాం.. ప్లాట్లు ఇప్పించండి

11-06-2025 12:00:00 AM

- బాధితుల మొర 

- డెవలపర్స్ ముసుగులో ఒకరు ఫైనాన్సర్స్ ముసుగులో మరొకరు 

- అంతా కుమ్మక్కయ్యా రు 

- మధ్యతరగతి వాళ్ళం న్యాయం చేయండి 

- బాధితుల అరణ్య రోదన 

నిజామాబాద్ జూన్ 10:(విజయ క్రాంతి): నిజామాబాద్ నగర శివారులో వెలసిన జే జే డెవలపర్స మొదట విక్రయించిన భూముల తాలూకు 90% నికి పైగా డబ్బులు చెల్లించమని 72  ప్లాట్ల కు సంబంధించిన వ్యక్తులు వారి బంధువులు తాము మోసపోయామని ఆరోపిస్తున్నారు.

200 గజాల ప్లాట్లు మొదలుకొని వివిధ కొలతలతో ఉన్న ప్లాట్ లను తమకు విక్రయించారని  ప్లాట్ల నంబర్లు వేసి తమకు అగ్రిమెంట్ చేసి ఇచ్చారని ఆ భూముల తాలూకు కొందరు పూర్తిగా డబ్బులు చెల్లించగా మరికొందరు 90% నీకి పైగాడబ్బులు  చెల్లించినప్పటి కీని  తమకు భూములు రిజిస్ట్రేషన్ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు.

దాదాపు 80 కోట్లకు పైగా విలువగల భూమినీ చూపి తమకు ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ప్లాట్లు ఇవ్వమని  అడిగితే బెదిరింపులకు పాల్పడుతు తమని భయాందోళన కు గురి చేస్తున్నారని  వారిపై చర్యలు తీసుకోవాలని జే జే డెవలపర్స్ కు డబ్బులు చెల్లించిన బాధితులుజిల్లాయంత్రాంగాన్నివేడుకుంటున్నారు. మరోవైపు జై జై డెవలపర్స్ పేరా నిజామాబాద్ శివారు హైదరాబాద్ రోడ్ లో గల సర్వే నంబర్ 265/పి/1, 265/పి 1/2,  268/పి/1/1, 268/పి/1/2,265/ఎ 2/,265/పి/3 268/పి పాంగ్రా (బి) రెవెన్యూ శివారు నిజామాబాద్ సర్వేనెంబర్ 12 48/2 బర్దిపూర్ గ్రామం డిచ్పల్లి మండలం నిజామాబాద్ లోని సుమారు 16 ఎకరాల 20 గుంటల భూమి నుంచి ప్లాట్లు గా మార్చి తమకు ప్లాట్లు అమ్మారని బాధితులు తెలిపారు.

ఇందులో సుమారు 70 ప్లాట్ల కు పైగా విక్రయించార ని జే జే డెవలపర్స్ నిర్వాహకులు ఆ మేరకు తమకు ఒప్పంద పత్రం రాసి ఇచ్చారని వారు చెప్పిన ధర ప్రకారం గజానికి చొప్పున ధర లెక్కగట్టి కొందరు వద్ద నుండి పూర్తి డబ్బులు తీసుకోక మరికొందరు నుండి 90% పైగా 72 ప్లాట్ లకు సంబంధించి 12 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు తీసుకొని భూమిని తమకు అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు భూ యజమాని డబ్బులకు ఒత్తిడి తేవడంతో తాము ఫైనాన్సర్ల ను ఆశ్రయించా మని ఫైనాన్స్ దగ్గర నుండి దాదాపుగా 14 కోట్ల 75 లక్షల వరకు డబ్బులు వడ్డీకి తెచ్చామని ఆ డబ్బుల తాలూకు భూ యజమాని పట్టేదారు నుండి ఫైనాన్సర్ల పేరా రిజిస్ట్రేషన్ చేశామని డెవలపర్లు చెప్తున్నారు. ముందుగా డబ్బులు చెల్లించిన 72 ప్లాట్ లకు సంబంధించిన ప్రజలకి భూములు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి డబ్బులు దండుకున్న డెవలపర్లు పక్కాగా అగ్రిమెంట్లు రాసి ఇచ్చి అప్పటికిని పట్టేదారు నుండి భూమిని డబ్బులు చెల్లించిన 72 ప్లాట్ల తాలూకు వారికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఫైనాన్సర్ల పేరా రిజిస్ట్రేషన్ చేయడంపై డబ్బులు చెల్లించిన వారు మండిపడుతున్నారు.

జేజే డెవలపర్స్ డబ్బులు తీసుకున్న వారికి భూములు ఇవ్వకుండా ఫైనాన్షియర్స్ అయినా మహంకాళి వీరేశం తండ్రి రాములు నిజామాబాద్ చిత్తూరి శ్రీహరి తండ్రి సూర్యారావు ఇందూరి నరేష్ తండ్రి ఇందూరి భూమయ్య గుప్తా ఇందూరు శ్రీనివాస్ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ పార్ట్నర్స్ పేరా రిజిస్ట్రేషన్ చేశారని వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ పార్ట్నర్స్ లలో ఎస్ రంజిత్ రెడ్డి పి చంద్రశేఖర్ ఎం వెంకటరమణ వి సురేందర్ ఎం సంతోష్ టి రంగయ్య పి కాశీనాథ్ పేరున భూమి పట్టదారుల నుంచి రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

తాము డబ్బులు చెల్లించామని భూములు తమకు చెల్లించకుండా శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ పార్ట్నర్స్ పేరా రిజిస్ట్రేషన్ చేయడం ఏమిటని డెవలపర్లను డబ్బులు చెల్లించిన వారు నిలదీయగా ఫైనాన్సర్ల నుండి భూ యజమానులకు డబ్బులు ఇచ్చామని ఫైనాన్సర్ల చే భూములకై డబ్బులు చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని నమ్మబలికారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గత కొద్ది రోజుల క్రితం వెంచర్ లోకి వెళ్తే డబ్బులు చెల్లించిన తమను వెంచర్ లోకి రానివ్వకుండా ప్రైవేటు వ్యక్తులచే గెంటేయించారని తమను ఉద్దేశపూర్వకంగానే జే జే డెవలపర్స్ భూమి పట్టేదారు లు  ఫైనాన్సర్లు అందరూ కలిసి మోసం చేసినట్టుగా భావించాల్సి వస్తుందని ఈ విషయమై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారువాపోతున్నారు.

డబ్బులు చెల్లించాం.. 

జే జే డెవల పర్స్ పేరా డబ్బు ల తాలూకు రసీదులు ఇచ్చా రు. మా వద్ద నుండి తీసుకున్న డబ్బులకు ప్లాట్లను మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా నాకు కేటాయించిన 202 గజాల ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. పట్టేదారు నుంచి నేరుగా తమకే అగ్రిమెంట్ ఉందని 50 లక్షల పైగా డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేశామని చెప్పిన జె జె డెవలపర్స్ తీరా పట్టేదారుతో ఫైనాన్సర్లుగా చెప్పబ డుతున్న మహంకాళి వీరేశం చిత్తూరు శ్రీహరి పేరా 12. 5 ఎకరాల భూమి రిజి స్ట్రేషన్ చేశారని ఇందూరు నరేష్ ఇందూ రు శ్రీనివాస్ పేరా నాలుగు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారని తెలిసింది అప్పు కింద 14 కోట్ల 75 లక్షల రూపా యలు తీసుకొని పట్టేదారుతో భూమిని ఫైనాన్సర్ల పైన రిజిస్ట్రేషన్ చేశామని డెవలపర్లు చెప్తున్నారు. ఈ విషయమై అప్పటి పోలీస్ కమిషనర్ కల్మేష్ గారికి ఫిర్యాదు చేశాం. 

 లంక శ్రీధర్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితుడు

జేజే డెవలపర్స్ పేరా ప్లాట్లకై డబ్బులు తీసుకున్నారు 

అంతా కుమ్మక్క య్యా రు మమ్మల్ని మోసం చేశారు. శ్రీనివాసరెడ్డి ధనుంజయ రెడ్డి లతో పాటు మరో ఇద్దరు జె జె డెవలపర్స్ పేరా నిజామాబాద్ నగర శివారులోని హైదరాబాద్ రోడ్ లో వెంచర్లు ప్లాట్లు కొనమని మమ్మల్ని సంప్రదించారు. పిల్లల భవిష్యత్తు ఉంటుందని ఆశతో 12 లక్షలకు పైగా డబ్బులు చెల్లించగా సదరు డెవలపర్స్ అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. తీరా భూమి ని అప్పగించమని అడిగితే  భూమిని పట్టేదానికి డబ్బులు చెల్లించాల్సి ఉండటం వల్ల అప్పు తెచ్చామని అప్పు ఇచ్చిన ఫైనాన్సర్ల పేరా పట్టేదారి నుండి నేరుగా రిజిస్ట్రేషన్ చేశామని అంటున్నారు.

మాతో డబ్బు తీసుకొని మాకు కేటాయించిన అగ్రిమెంట్ ప్లాట్లను ఫైనాన్సర్ పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు....? అడిగితే ఫైనా న్సర్లతో మీ పేరు రిజిస్ట్రేషన్ చేయిస్తాం అంటున్నారు. ఫైనాన్సర్ మాత్రం ముందుగా కుదుర్చుకున్న రేటుకు రెట్టిం పు గజానికి రూ 15 వేల చొప్పున ఇస్తేనే గాని రిజిస్ట్రేషన్ చేయమని అంటు న్నారు. మొత్తానికి వీరంతా కుమ్మక్కైనట్టు తెలుస్తోంది. 

అసలే నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఉన్న డబ్బు అంతా ప్లాటు కొనుగోలు కై చెల్లించాను చిల్లిగవ్వ చేతిలో లేదు నాకు న్యాయం చేసి మోసానికి పాల్పడిన స్థిరాస్తి వ్యాపారులపై చర్య తీసుకొని నన్ను ఆదుకోవాలని చెప్పి అధికా రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. 

  తుమ్మల చైతన్యకుమార్ బాధితుడు