14-04-2025 12:00:00 AM
డాక్టర్లుగా గొప్ప పేరు తెచ్చుకోవాలి
సురభి గ్రాడ్యుయేషన్డేలో హరీశ్రావు, రఘునందన్రావు
సిద్దిపేట, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): వైద్య వృత్తిలో గొప్పగా రాణించి తల్లి దండ్రులకు, సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కాళోజీ యూనివర్సిటీ వీసీ నందా కుమార్ రెడ్డి లు అన్నారు. సిద్దిపేట జిల్లా ఆదివారం మిట్టపల్లి సమీపంలో సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మొదటి గ్రాడ్యుయేషన్ వేడుకలకు హాజరై వారు మాట్లాడారు. కొద్దిమంది కి మాత్రమే డాక్టర్ గా అయ్యే అవకాశం ఉంటుందన్నారు కనబడని దేవుడి కి మొక్కుతారు అదేవిధంగా కనబడే డాక్టర్ కి మాత్రమే ప్రజలు మొక్కుతారని అన్నారు.
గతంలో తెలంగాణ లో మెడికల్ కాలేజీ లు తక్కువగా ఉండేవని తెలంగాణ వచ్చాక చాలా మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. మారుతున్న కాలం కు అనుగుణంగా డాక్టర్స్ తయారు అవ్వాలన్నారు. తల్లిదండ్రులు కోరిక తమ పిల్లలు డాక్టర్లు గా అవ్వాలని ఉంటుందని తల్లి దండ్రుల కోరిక నెరవేర్చడం తో పాటు సామాజిక బాధ్యత తో వైద్యం అందివాలని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య విద్య కేవలం10 వేల రూపాయలు మాత్రమే అందుబాటులోకి తెచ్చిందన్నారు. డాక్టర్లు గా వెళ్తున్న 2019 బ్యాచ్ విద్యార్థులు మీ గ్రామానికి ,మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సురభి మెడికల్ కాలేజీ చైర్మన్ హరిందరావు, మహేందర్ రావు, మనోహర్ రావు, డీన్ రఫీ, మెడికల్ డైరెక్టర్ రామ్ ప్రసాద్, పీఆర్ ఓ పరిశరములు తదితరులు పాల్గొన్నారు.