calender_icon.png 3 June, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలి

01-06-2025 07:13:31 PM

ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర...

వలిగొండ (విజయక్రాంతి): యువతను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమిద్దామని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని లబ్దిదారులకు ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు పిలుపునిస్తామని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర(AIYF State Secretary Kalluru Dharmendra) అన్నారు. ఏఐవైఎఫ్ వలిగొండ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ధర్మేంద్ర మాట్లాడుతూ.. మోడీ అంటే కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి ఊడిగం చేసే ప్రధాని అని, ప్రధాని బాధ్యతను సైతం దుర్వినియోగం చేసే చరిత్ర హీనుడని వారు ధ్వజమెత్తారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను, అమాయక గిరిజనులను హతమారుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తక్షణమే నిలిపివేయాలని అన్నారు.

ఏఐవైఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పిందని, రాష్ట్రంలోని 16.25 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా సీబిల్ స్కోర్ తప్పకుండ ఉండాలనే నిబంధనతో లక్షల మంది యువతను ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు, కార్యదర్శి మారోజు నర్సింహా చారి, సుద్దాల సాయి కుమార్, నేతలు మేడి దేవేందర్, మామిడికాయల నరేష్, పబ్బు కార్తీక్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.