calender_icon.png 3 June, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం

01-06-2025 07:07:18 PM

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) అన్నారు. ఆదివారం హాజీపూర్ మండలానికి 251, లక్షెట్టిపేట మండలానికి 477మంది లాబ్దిదారులకు, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి చెందిన 237 మంది లబ్దిదారులకు, దండేపల్లి మండలానికి చెందిన 588 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లును ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకొని ఇప్పటివరకు దండేపల్లి మండలంలో 692 మంది లబ్దిదారులకు, లక్షెట్టిపేట్ మండలానికి, మున్సిపాలిటీకి 931 మంది లబ్దిదారులకు, హజీపూర్ మండలానికి 445 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లును ఇచ్చామని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఎంపికైన ధర్మరావుపేట్, ర్యాలీ, కొత్తూరు గ్రామాల ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంబంధింత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.