31-05-2025 12:00:00 AM
కామారెడ్డి సర్కిల్ విద్యుత్ సూపెరింటెండింగ్ ఇంజినీర్ ఎన్ శ్రావణ్ కుమార్
కామారెడ్డి, మే 30 (విజయక్రాంతి): గత సంవత్సరం నవంబర్ నెల నుండి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం వలన విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించా మని జిల్లా విద్యుత్ శాఖ సూపర్డెంట్ శ్రావణ్ కుమార్ తెలిపారు .
శుక్రవారం ఆయన కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోడ్ పెరిగే అవకాశం ఉన్న చోట్ల .కలెక్టరేట్,అన్నారం, ఎల్లపేట, కాకతీయనగర్, కొండాపూర్ ప్రాంతాలలో కొత్తవి 4, 5-MVA మరియు 1, 3.15-MVA పవర్ ట్రాన్స్ఫార్మర్లను నెలకొల్పామని వివరించారు .
కలెక్టరేట్,అన్నారం, ఎల్లపేట, కాకతీయనగర్, కొండాపూర్ ప్రాంతంలో పవర్ ట్రాన్స్ఫార్మర్లను కొత్తవి నెలకోల్పడం వలన విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించగ లిగాం అని తెలిపారు. ఇప్పటివరకు 177 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, 110 ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం కూడా పెంచామని చెప్పారు.
ఇప్పటివరకు 13 వీసీబీ ( VACCUM CIRCUIT BREAKER) లు ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా సదాశివనగర్, మాచరెడ్డి, రామారెడ్డి, వెలుపుగొండ,దోమకొండ, భిక్కనూర్, రాజంపేట, లింగంపేట్, బిచ్కుంద, బాన్సువాడ, నిజాంసాగర్ ప్రాంతాలకు అంతరాయాలు తగ్గించగలిగామన్నారు .
33KV ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థ అనేది ఒక 33/11KV సబ్ స్టేషన్ నుండి మరొక 33/11KV సబ్ స్టేషన్ కు, అలాగే ఒక 33/11KV సబ్ స్టేషన్ నుండి మరొక 132/33KV సబ్ స్టేషన్ కు, ఇదే విధంగా 33KV లైన్ నుండి మరొక 33KV లైన్ కు మధ్య అనుసంధానంగా ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందచేయడం సులువుగా ఉంటుంది.
ప్రకృతి వైపరీత్యాల వలన లేదా సాంకేతికంగా సమస్యలు ఏర్పడినప్పుడు లేదా సబ్ స్టేషనల నిర్వహణ చేపడుతున్నప్పుడు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందచేయడానికి ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఎంతగానో దోహద పడుతుందని వివరించారు .
ఇప్పటివరకు 8.255 కిలోమీటర్ల మేర 6 సబ్ స్టేషన్ల కు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారుహౌసింగ్ బోర్డు, చిన్న మల్లారెడ్డి, కామారెడ్డి టౌన్, పోసానిపేట, రామారెడ్డి, కాకతీయ నగర్, ప్రాంతాలకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఉందని అన్నారు . కొని చోట్లా పనులు పురోగతిలో ఉన్నవని వివరించారు.
ఎక్కడైతే వోల్టేజ్ కు అనుగుణంగా హెచ్చు తగ్గులు లేకుండా ఉండటానికి లైన్ లలో 4 600 KVAR కెపాసిటర్ బ్యాంకులు క్షేత్ర స్థాయిలో పెట్టడం జరిగిందని, అలాగే 33/11 కేవీ సబ్ స్టేషన్లో 9, 1 MVAR/2 MVAR కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీటి వలన విద్యుత్ సరఫరా వ్యవస్థలో రీయాక్టివ్ పవర్ కాంపన్సేషన్ పవర్ ప్రాక్టీస్ ఘననీయంగా మెరుగు పరచడానికి దోహదపడుతుందని అన్నారు, వీటి వలన విద్యుత్ సరఫరాలో లైన్లు ఓవర్ లోడ్ కాకుండా నియంత్రిస్తుoదన్నారు.
టెక్నికల్ నష్టాలు ఘననీయంగా తగ్గుతాయాని, పరికరాల మన్నిక కూడా చాల కాలం పెరుగుతుందని అన్నారు . ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకొని పూర్తిగా వేసవికి సమాయత్తం అయినం కాబట్టే, ఎటువంటి అంతరాయాలు లేకుండా మెరుగైన విద్యుత్ విద్యుత్ సరఫరా అందించడానికి ప్రతి ఒక్క ఉద్యోగి నిబద్ధత్థో పనిచేయడం వల్లనే విజయవంతం అయ్యిందని విద్యుత్ శాఖ జిల్లా సూపర్డెంట్ శ్రావణ్ కుమార్ తెలిపారు .