24-11-2025 12:00:00 AM
నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం
చిట్యాల, నవంబర్ 23(విజయ క్రాంతి): నకిరేకల్ నియోజకవర్గంలోని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలోని తాళ్ల వెల్లంల గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సంఘాల వారికి ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లాయిపల్లి కాల్వ ద్వారా గ్రామంలోని పెద్ద చెరువును నింపడం జరిగిందని, త్వరలోనే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా కూడా నీటిని తెప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కిష్టాపురం, ఇప్పర్తి గ్రామాలకు రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని, రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ రుణాలు మంజూరు చేయిస్తామని అన్నారు.
ఏఎంసీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఐతరాజు యాదయ్య, సింగిల్ విండో చైర్మన్ రఘుమా రెడ్డి, ఎంవిహెచ్ ఫౌండేషన్ చైర్మన్ వడ్డేపల్లి శ్రీశైలం, మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్, మాజీ ఎంపిటిసి వడ్డేపల్లి లక్ష్మయ్య, పజ్జూరి అజయ్ కుమార్ రెడ్డి, జనగాం అంజయ్య గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసయ్య, అంతటి పారిజాత నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి :ఎమ్మెల్యే మందుల సామేలు
నూతనకల్, నవంబర్ 23:మండల కేంద్రంలోని కేడీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మం దుల సామేలు ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిదర్ రెడ్డి, పిఏసియస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి,జిల్లా నాయకులు దరిపెల్లి వీరన్న,పాల్వాయి నాగరాజు, మిర్యాల గ్రామ శాఖ అధ్యక్షులు మన్నెం దశరథ,నాయకులు అనంతుల శ్రీను,గుణగంటి వెంకన్న,ఇరుగు కిరణ్,మెంచు లింగమల్లు, వేల్పుల కిరణ్,ఇతర ముఖ్య నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.