15 April, 2026 | 8:05 AM

పాత్రికేయులకు తప్పకుండా న్యాయం చేస్తాం

30-12-2025 02:01 AM

నిర్మల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇప్పించే విధంగా కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ స య్యద్ అర్జున్ అలీ, పెన్షన్లు సంఘం జాతీయ కార్యదర్శి లింగన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పాత్రికేయులు నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని సోమవారం సందర్శించి చర్చ లు జరిపారు. ఈ విషయాన్ని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకు వచ్చామని త్వరలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని వారం రోజుల్లో సమస్య పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 

ఇదిలా ఉండగా ఏడో రోజు దీక్షకు ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డి, సిపిఐ నాయకులు విలాస్ రమేష్, ఎస్‌ఎన్ రెడ్డి, యాదవ సంఘం నాయకులు మనోజ్ యాదవ్, పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ , పైవేట్ విద్య కళాశాల నిర్వాకులు వెంకటరెడ్డి, అఖిలేష్ కుమార్, ఉద్యమకార్డు ఇస్మాయిల్ బీఆర్‌ఎస్ పార్టీ నేతలు రామకృష్ణారెడ్డి, మార్గొండ రాము  తదితరులు సంఘీభావం తెలిపి మద్ద తు పలికారు. ఏడో రోజు దీక్షలో తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు.