12-06-2025 12:45:36 AM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రాజేంద్రనగర్, జూన్ 11: నియోజకవర్గ అభివృద్ధికిఅహర్నిశలు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతీ మున్సిపాలిటీలోనూ,డివిజన్ లో అవసరమైన అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు.బుధవారం ఆయన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోరూ.7 కోట్ల 30 లక్షల తో వార్డ్ నంబర్ 2,3,5,6,7,13, 14 లోని హిమగిరి నగర్ పెద్దమ్మ టెంపుల్, కపిల్ నగర్, ఎల్ఎన్ఎస్ కాలనీ, పిఎన్టి కాలనీ నర్సారెడ్డి కాలనీ, పద్మశ్రీ హిల్స్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులుపాల్గొన్నారు.