14-06-2025 12:36:44 AM
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, జూన్ 13 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బడిబాట కార్యక్రమంలో పాల్గొని పాఠశాల ఆవరణలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే బాలురను ఎత్తుకొని శ్రీకారం చుట్టించారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు ఉంటారని తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి చదివించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.