calender_icon.png 14 June, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజీలో సీట్లు నిండట్లే

14-06-2025 12:37:29 AM

- ఏటా 50 శాతం కూడా భర్తీకానీ సీట్లు

- గతేడాది 46 వేల సీట్లలో నిండినవి 21 వేలే

- ఈ ఏడాదికి అదనంగా 4 వేల సీట్ల పెంపు

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) సీట్లు భర్తీ కావడం లేదు. సీట్లు భారీగానే ఉంటు న్నా... అందులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఏటా సగానికిపైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. మరోవైపు ఎం తోకొంత సీట్లు, కాలేజీల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్ తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఇష్టపడటంలేదు.

రాష్ట్రంలో ఉస్మా నియా యూనివర్సిటీ, కాకతీయ, శాతవాహ న, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, జే ఎన్టీయూ వర్సిటీల పరిధిలోని పీజీ సీట్లను కామన్ పీజీ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తా రు. ఈ వర్సిటీల పరిధిలో గతేడాది 297 కాలే జీలున్నాయి. వీటిలో 46,742 సీట్లు ఉంటే అందులో కేవలం 21,560 సీట్లు మాత్రమే నిండాయి. 297 కాలేజీల్లో ప్రభుత్వ కాలేజీలు 41, క్యాంపస్ కాలేజీలు 30 ఉండగా, ప్రైవేట్ కాలేజీలు 249 ఉన్నాయి.

వీటన్నింటిలోనూ క్యాంపస్ కాలేజీల్లో చేరేందుకు ఎక్కువగా విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడటంలేదు. మరోవైపు కొన్ని పీజీ కోర్సులు పూర్తి చేసిన తర్వాత సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవ డం, ఉన్నా తక్కువ జీతాలు లభిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే కొంత మంది విద్యార్థులు పీజీ చేయకుండానే ఉద్యోగాలు వెతుక్కోవడా నికి, స్వయం ఉపాధిని ఎంచుకోవడానికి మొ గ్గు చూపుతుంటే, మరికొంత మంది విద్యా ర్థులేమో డిగ్రీ తర్వాత మెడికల్ కోర్సులు, ఎంసీఏ, ఎంబీఏ, డిమాండ్ ఉన్న కోర్సుల వైపు వెళ్తున్నారు. 

ఈ ఏడాది పెరగనున్న సీట్లు

ఒకవైపు సీట్లు నిండటం లేదంటే మరోవై పు కొత్త సీట్లకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. 2025 విద్యాసంవత్సరానికి అదనంగా 4 వేల సీట్లు పెరిగాయని అధికారులు చెప్తున్నా రు. 2023 విద్యాసంవత్సరంలో 287 కాలేజీల్లో 47,211 సీట్లకు 20,519 మాత్రమే భర్తీ అయ్యాయి. 2024 297 కాలేజీల్లో 46,742 సీట్లకు 21,560 సీట్లు నిండాయి. ఇక ఈ విద్యాసంవత్సరానికి 50, 742 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి లోనూ కనీసం 22 వేల సీట్లు నిండుతాయో లేదో చూడాలి. సంప్రదాయ పీజీ కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు ముందుకురావడం లేదు.

మూడు విడుతల్లో సీట్లను భర్తీ చేస్తున్నా, ఈ కోర్సుల్లో సీట్లు ఖాళీగా దర్శన మిస్తున్నాయి. పలు కోర్సుల్లో అడ్మిషన్లు లేక కోర్సులు వెలవెలబోతున్నాయి. 2024 ఏడాది సీపీగెట్ పరీక్షలకు ఏకంగా 73,342 మంది దరఖాస్తు చేసుకుంటే 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 94 శాతం క్వాలిఫై అయ్యారు. కౌన్సిలింగ్‌లో సీట్లు పొం దుతున్నా కాలేజీల్లో చేరేవారి సంఖ్య తక్కువ గా ఉంటోంది. ఇంత మంది పరీక్షకు హాజరై, అర్హత సాధిస్తున్నా ఇంత పెద్ద మొత్తంలో సీట్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.