08-08-2025 12:22:04 AM
సీఎం రేవంత్రెడ్డితో అమిటీ యూనివర్సిటీ ఛాన్స్లర్ అతుల్ చౌహాన్
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): తెలంగాణ విద్యా రంగం అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని సీఎం రేవంత్రెడ్డికి అమిటీ యూనివర్సిటీ ఛాన్స్లర్ అతుల్ చౌహాన్ హామీ ఇచ్చారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డిని అతుల్ చౌహాన్ గురువారం కలిశారు. తెలంగాణలో తమ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ర్ట క్యాబినెట్ ఆమోదముద్ర వేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ర్టంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగస్వాములవుతామని సీఎంకు చౌహాన్ తెలిపారు. మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యాబోధనతో ఇప్పటికే అమిటీకి మంచి పేరు ఉందని, తెలంగాణలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అమిటీ యూనివర్సిటీ ప్రతినిధి రామచంద్రం పాల్గొన్నారు.