04-06-2025 01:21:45 AM
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనక చర్ల ప్రాజెక్టును అక్రమంగా నిర్మించ తలపెట్టిందని, దానిని తాము ఎట్టి పరిస్థి తుల్లోనూ ఒప్పుకోమని.. అడ్డుకుని తీరతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో మంత్రి చిట్చాట్ నిర్వహించారు. బనకచర్లను అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని.. ఇంకా ఏం ప్రయత్నాలు చేయాలో అవి కూడా చేస్తామని స్పష్టం చేశారు.
రెండురోజుల్లో ఈ అంశంపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజె క్టుకు వ్యతిరేకంగా జీఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు లేఖలు రాశామని మంత్రి వెల్లడించారు. తాము బనకచర్ల ప్రాజెక్టును సుతారమూ ఒప్పుకోమని కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లామని.. తెలంగాణ అభ్యంతరాలను ఆయనకు వివరించామని చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టు నిర్మా ణం చేపట్టేందుకు అవకాశం ఇవ్వొద్దని కోరామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అంశంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరైంది కాద ని, త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సముద్రంలో కలిసే నీళ్ల ని తాము వాడుకుంటున్నామని ఏపీ నాయకులు ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీళ్లని చెప్పేందుకు ఏపీకి అధికారం లేదని అన్నారు.
జీఆర్ఎంబీ, కేంద్ర జలసంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. వృథాగా సముద్రంలో కలిసే నీళ్లని ప్రాజెక్టులు ప్రారంభించి ఆ తర్వాత సదరు ప్రాజెక్టులకు హక్కులు, కేటాయింపులంటూ వాస్తవంగా నీటిని పొందలేని తెలంగాణకు అన్యాయం చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేసినా తాము అంగీకరించబోమన్నారు.
కాగా బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం, కేంద్రం ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు ఏపీ అధికారులు పూర్తి వివరాలు అం దించేందుకు సిద్ధమయ్యారు. రూ. 81 వేల కోట్లతో ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే.