calender_icon.png 18 June, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ మన్సూరాబాద్​ డివిజన్ కమిటీ ఎన్నిక

17-06-2025 11:12:12 PM

ప్రెసిడెంట్​గా మునగాల హరీశ్​ రెడ్డి నియామకం..

ఎల్బీనగర్: ఎల్బీనగర్ ​నియోజకవర్గంలోని మన్సూరాబాద్​ డివిజన్ కు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) కొత్త కమిటీ నియామకమైంది. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ ​అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్​రెడ్డి, రాష్ట్ర నాయకుడు కొప్పుల నర్సింహారెడ్డి సమక్షంలో మంగళవారం కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. డివిజన్​ ప్రెసిడెంట్​గా మునగాల హరీశ్ ​రెడ్డి నియామకమయ్యారు.

డివిజన్ వైస్ ​ప్రెసిడెంట్లుగా ఎంజాల జగన్, ఏ. ప్రమోద్ రెడ్డి, పి. సంపత్ గౌడ్, డి. శ్రీనివాస్, జనరల్ ​సెక్రటరీలుగా టి. శ్యాంసుందర్ రెడ్డి, ఎం. నవీన్ రావు, కార్యదర్శులు కె. మోహన్ రెడ్డి, బీసీ నరసింహుడు, జి. గోవింద్ రెడ్డి, విజయ లక్ష్మి, ట్రెజరర్​గా కె. దామోదర్ గౌడ్, ఆఫీస్ ఇన్​చార్జిగా ఎల్లారెడ్డి, మహిళా మోర్చా ప్రెసిడెంట్​గా మల్లు మంగారెడ్డి, ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్​గా ప్రవీణ్ కుమార్ గౌడ్, ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్​గా మెరిగ మల్ల విజయకుమార్ ను నియమించారు.

ఈ సందర్భంగా కొత్త కమిటీని శ్రీనివాస్​రెడ్డి, నర్సింహారెడ్డి అభినందించారు. సభ్యులు తమ నియామకానికి సహకరించినందుకు డివిజన్ ప్రబారి కొత్త రవీందర్ గౌడ్ కి, కళ్లెం రవీందర్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్‌లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.