17-06-2025 11:12:12 PM
ప్రెసిడెంట్గా మునగాల హరీశ్ రెడ్డి నియామకం..
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ కు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) కొత్త కమిటీ నియామకమైంది. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కొప్పుల నర్సింహారెడ్డి సమక్షంలో మంగళవారం కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. డివిజన్ ప్రెసిడెంట్గా మునగాల హరీశ్ రెడ్డి నియామకమయ్యారు.
డివిజన్ వైస్ ప్రెసిడెంట్లుగా ఎంజాల జగన్, ఏ. ప్రమోద్ రెడ్డి, పి. సంపత్ గౌడ్, డి. శ్రీనివాస్, జనరల్ సెక్రటరీలుగా టి. శ్యాంసుందర్ రెడ్డి, ఎం. నవీన్ రావు, కార్యదర్శులు కె. మోహన్ రెడ్డి, బీసీ నరసింహుడు, జి. గోవింద్ రెడ్డి, విజయ లక్ష్మి, ట్రెజరర్గా కె. దామోదర్ గౌడ్, ఆఫీస్ ఇన్చార్జిగా ఎల్లారెడ్డి, మహిళా మోర్చా ప్రెసిడెంట్గా మల్లు మంగారెడ్డి, ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్గా ప్రవీణ్ కుమార్ గౌడ్, ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్గా మెరిగ మల్ల విజయకుమార్ ను నియమించారు.
ఈ సందర్భంగా కొత్త కమిటీని శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి అభినందించారు. సభ్యులు తమ నియామకానికి సహకరించినందుకు డివిజన్ ప్రబారి కొత్త రవీందర్ గౌడ్ కి, కళ్లెం రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.