రిటైర్డ్ ఆర్మీ జవాన్ స్వాగతం.. సన్మానం
లక్ష్మణ చందా,(విజయక్రాంతి) సంవత్సరాలు ఆర్మీలో పలు హోదాల్లో దేశ సేవ చేసి శనివారం రిటైర్మెంట్ తీసుకున్న నరకట్ల భాస్కర్ ఆర్మీ జవాన్ కు ఆదివారం మిత్రులు బంధువులు పరిసర ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. భాస్కర్ నిర్మల్ శాంతినగర్ గ్రామవాసి తన విద్యాభ్యాసం శాంతినగర్ ప్రాథమిక పాఠశాల, వడ్యల్ జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో జరిగింది.
1994-95 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన భాస్కర్ తదనంతరం ఆర్మీలో చేరాలని సంకల్పంతో శిక్షణ తీసుకొని ఆర్మీ జవాన్ గా సెలెక్ట్ అయ్యాడు. ఆనాటి నుంచి నేటి వరకు 24 సంవత్సరాలు నిరంతరంగా దేశ సేవకు అంకితమయ్యాడు. రిటైర్మెంట్ సందర్భంగా ఆయన చిన్ననాటి మిత్రులు వాద్యాల పాఠశాల ఆనాటి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఘన స్వాగతం పలికి తన సన్మానం చేశారు తమ మిత్రుడు దేశ సేవకు అంకితమైన విషయాన్ని పలువురుతూ పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భాస్కర్ మిత్రబృందం ఆయన బంధుమిత్రులు ఆనాటి ఉపాధ్యాయులు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




