కొత్త బస్సుల ప్రారంభోత్సవానికి వెల్దండ మహిళల ప్రయాణం
10-06-2026 12:54 AM
వెల్దండ, జూన్ 9: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించిన మహిళా సంఘాల బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్దండ మహిళా సంఘాల సభ్యులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద హైదరాబాద్కు వెళ్లే బస్సును జిల్లా దిశ కమిటీ సభ్యుడు మోతీలాల్ నాయక్, ఏపీఎం జయ లలిత జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హరికృష్ణ నాయక్, పర్వత రెడ్డి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






