27-06-2025 09:52:12 PM
చండూరు,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ యువ నాయకులు సాయికుమార్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలో సాయికుమార్ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు నిరుపేదలకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం వారి మృతి పట్ల వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.