calender_icon.png 28 June, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయికుమార్ కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

27-06-2025 09:52:12 PM

చండూరు,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ యువ నాయకులు సాయికుమార్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలో సాయికుమార్ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు నిరుపేదలకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం వారి మృతి పట్ల వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.