calender_icon.png 20 June, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి?

20-06-2025 12:00:00 AM

- మున్సిపాలిటీలో అనుమతికి మించి నిర్మాణాలు

- ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

ఇబ్రహీంపట్నం, జూన్ ౧౯ : ఆదిభట్ల మున్సిపాలిటీలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసు కునేందుకు అధికారులు ఎందుకో జంకుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్న ప్రభుత్వం ప్ర భుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి కొ డుతున్న కానీ మున్సిపాలిటీ అధికారులు చూసీ చూడనట్లు వ్య వరించడం పట్ల సర్వ త్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనుమతులు లేకుండా నిరుపేదలు చిన్న గుడిసె వే సుకున్న రాత్రికి రాత్రి అధికారులు అక్కడ వాలిపోయి పేదలు వేసుకున్న గూడులను నిర్దాక్షణంగా కూలగొట్టేందుకు అధికారులు ఆగం మేఘాల మీద అక్కడ వాలిపోతారు.... కానీ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీలో జోరుగా నిర్మాణాలు సాగుతున్న అ టువైపు కన్నెత్తి చూడకపోవడం అందులో మతలబు ఏంటో అంటూ స్థానికులు మండిపడుతున్నారు.ప్రభుత్వాన్నిబంధనలు అం దరికీ ఒకేలా ఉండాలి కదా.... అధికారం అం గ బలం... ఉన్నవాళ్లకు చట్టం వర్తించదు అం టూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఆదిభట్ల మున్సిపల్ లో ప్రధాన కీలకంగా వ్యవరించే టౌన్ ప్లానింగ్ విభాగం చెందిన అధికారు లు...మున్సిపాలిటీ కమిషనర్, ఇలా ఎవరికి వారే తమకేమీ పట్టనట్టు  విధులు నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ఆ దిభట్ల మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణలకు తెర లేపుతున్నారు. జి ప్లస్ అనుమతు తీసుకొని నిబంధనలు విరుద్ధంగా మూడు నుంచి ఐదు అంతస్తులు నిర్మిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆ దాయానికి భారీగా గండి పడుతుంది.

అక్ర మ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న అధికారుల్లో చలనం రావడంలేదం టూ స్థానికులు  మండిపడుతున్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో మంగళపల్లి, ఆదిభట్ల, ఫ్యాబ్సిటీ, ప్రఖ్యాతగాంచిన విల్లాలు, హౌసింగ్, హౌసింగ్ సొసైటీల పేరి ట కాలనీలు వెలుస్తున్నాయి. ఇదే ప్రాం తంలో కమర్షియల్ దుకాణాలు, అపార్ట్మెం ట్లు, వ్యాపార కేంద్రాలు, విద్యాసంస్థలు కు సంబంధించిన పలు నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 అక్రమ నిర్మాణాలపై వింత రూల్

 మున్సిపాలిటీలో హనుమంతులు మిం చి నిర్మాణాలు చేపడితే అందుకు ప్రతిఫలంగా రూ.3 నుంచి 5 లక్షలు చెల్లించా ల్సిందేనని మున్సిపాలిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అక్ర మ నిర్మాణదారులు ససే మీరా అంటూ వెనకడుగు వేస్తే... అధికారులకు అప్పుడు నిబంధనలు గు ర్తించి నోటీసులు జారీ చేస్తారు. కూ ల్చి వేదాలు తప్పదంటూ నాన్న హం గామా చేస్తారనే ఆరోపణ సైతం వినిపిస్తున్నాయి. అప్పుడే మధ్యవర్తులను రంగంలోకి దింపుతారు ఆతర్వాత తమ దారిలోకి తెచ్చుకోవడం ఇదంతా ఇక్కడి అధికారులకు వెన్న తో పెట్టిన విద్యలా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే యధావిధిగా ఈ అక్రమ నిర్మాణ పనులను కొనసా గించడం మున్సిపాలిటీలో ఇదంతా మా మూలైపోయింది. 

ఎన్ని ఫిర్యాదులొచ్చిన ఉలుకు పలుకు ఉండదు.

గతంలో అక్రమ నిర్మాణాలపై స్థానికులు మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి మార్పు రావడంలేదని, దీని వెనుక ఆంతర్యమేంటనీ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నా రు. ఇదంతా కూడా తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా మున్సిపాలిటీలో అక్ర మ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వివరణకు దూరంగా..

అక్రమ నిర్మాణాల విషయంపై వివరణ కోసం ఆదిభట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని సంప్రదించిన అందుబాటులోకి రాలేదు.

ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి..

పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా, మున్సిపల్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం సరికాదు. మున్సిపల్ అధికా రులు నిబంధనలను మరచి, అక్రమాలను ప్రోత్సహించడం అంటే మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టడమే. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకొని, అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలి.

మచ్చ మహేందర్, బీఎస్పీ పార్టీ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ