calender_icon.png 20 June, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజ్ఞాతం వీడండి... జనజీవన స్రవంతిలో కలవండి

20-06-2025 12:00:00 AM

  1. 12 మంది మావోయిస్టు లొంగబాటు 

వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ 

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 19, (విజయ క్రాంతి)కాలం చెల్లిన సిద్ధాంతాలతో అజ్ఞాతంలో చేరి ప్రాణాలు కోల్పోవడం కన్నా జనజీవన శ్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎస్పి రోహిత్ రాజు పిలుపునిచ్చారు. గురువారం సిపిఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది దళ సభ్యులు ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 81, 141 సిఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా మావోయిస్టులు ఆకర్షితులై స్వచ్ఛందంగా లొంగిపోతున్నారన్నారు. గురువారం మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది నిషేదిత మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారన్నారు.

వారిలో ముగ్గురు మహిళా సభ్యులున్నారన్నారు. ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు సాయిధ దళాల సంచారం తెలంగాణ_ చతిస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉందని, ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు దళాలకు సహకరించవద్దన్నారు. మావోయిస్టుల సమాచారం తెలిసినట్లైతే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో, జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. లొంగిపోయిన 12 మంది మావోయిస్టు సభ్యులకు తక్షణ సహాయంగా ప్రతి ఒక్కరికి రూ 25వేల నగదు చొప్పున మొత్తం రూ 3 లక్షలు అందించడం జరుగుతుందన్నారు.

వారి క్యాడర్ల వారేగా మిగతా నగదును ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని వారి బ్యాంకు ఖాతాలో చెక్కు రూపంలో వేయడం జరుగుతుందన్నారు. జనజీవన స్రవంతిలో కలిసినా దళ సభ్యులకు పునరావాస సౌకర్యం కల్పించుటకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తుందన్నారు.