2 July, 2026 | 2:59 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

ఆ గదిలో ఏం ఉంది..?

18-07-2024 12:05 AM

ఒడిశా జూలై ౧౭: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర భాండాగారం రహస్య గది తలుపులను గురువారం అధికారులు తెరవనున్నారు. దీనికి సంబం ధించి ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభమూహూర్తంగా నిర్ణయించారు. ఆ గదిలో ఏం ఉం టుందా అని ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో  నిర్వహించిన సమావేశంలో ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా జస్టిస్ రథ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపద బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్‌రూంకు తరలించాం. ఇప్పడు గురువారం రహస్య గదిని తెరిచి అందులో ఉన్న సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్ర పరుస్తాం. అనంతరం భాండాగారాన్ని పురావస్తు శాఖకు మరమ్మ తుల నిమిత్తం అపగిస్తామని వెల్లడించారు. పనులు పూర్తయ్యాక సంప దనంతా మళ్తీ రహస్య గదికి తెచ్చి లెక్కింపు చేపడతామని తెలిపారు.