calender_icon.png 31 May, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాల ఆర్థికస్థితి ఎందుకిలా?

27-05-2025 12:00:00 AM

భారతదేశం ప్రపంచంలోనే నా లుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా స్థిరపడిన నేపథ్యంలో దేశంలోని ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటే ఒకింత ఆశ్చర్యమేస్తుంది. అన్ని రాష్ట్రాలూ సమానస్థాయిలో ఆర్థిక ప్రగతిని సాధించలేక పోతున్నాయన్నది స్పష్టమవుతుంది.

దీని కారణాన్ని ఈ సందర్భంగా తెలుసుకొని ఆ మేరకు కేంద్రం సహా ఆ యా రాష్ట్రాల ప్రభుత్వాలు, పాలక పక్షాలు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కొన్ని భారతీయ రాష్ట్రాలు ఆర్థికంగా దృఢంగా ఉంటే, మరికొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అనేక రకాల సవాళ్లు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నట్టు నీతిఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తాజాగా తెలిపారు. నీతిఆయోగ్ పాలక మండలి సమావేశం అనంతరం ఆయన పత్రికలవారితో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థల ఎదుగుదలలో అమెరికా, చైనా, జర్మనీ దేశాల తర్వాతి స్థానాన్ని ఇప్పుడు భారత్ ఆక్రమించింది.

‘ఇది వికసిత్ భారత్ వైపు పడిన పెద్ద ముందడుగు’ అని, దీనిని సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా కొన్నేండ్లలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ నిలువగలదన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ప్రత్యేకించి అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా జాతీయ స్థాయిలో ఉన్నట్టుగా, ఇంత మెరుగ్గా ఉండి ఉంటే బావుండేది.

‘ప్రధాని మోదీ నాయకత్వంలో తెచ్చిన పాలసీలతో ప్రపంచ 4వ స్థానం సాధ్యమైందని’ కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మనం జపాన్‌ను అధిగమించామని, త్వరలోనే జర్మనీ ని కూడా అధిగమిస్తామని ఆయనన్నారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రెండేండ్లలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందు తుందని’ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థకూడా అంచనా వేసిందని ఆయన తెలిపారు. 

కొనసాగుతున్న అంతర్రాష్ట్ర వ్యత్యాసం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా దేశ ఆర్థిక నివేదిక ఈ సందర్భంగా గమనార్హం. గత మూడేళ్లుగా, భారత రాష్ట్రాలు ‘ఆర్థిక బాధ్య త చట్టం’ (ఫిస్కల్ రెస్పాన్స్‌బులిటీ లెజిస్లేషన్) కింద 3% జీఎఫ్‌డీ జీఎస్‌డీపీ ప్ర మాణాన్ని విస్తృతంగా పాటించాయని, ఏకీకృత జీఎఫ్‌డి 2022 2.7%కి తగ్గిందని, 2023 (పిఏ)లో 2.9%కి కొద్దిగా పెరిగిందని నివేదిక వెల్లడించింది.

అయితే, గణనీయమైన అంతర్రాష్ట్ర వ్యత్యా సం మాత్రం అలాగే ఉంది. ఉదా॥కు బీహార్ (8.9%), హిమాచల్‌ప్రదేశ్ (6.1%), ఛత్తీస్‌గఢ్ (7.3%) సగటును గణనీయంగా అధిగమించాయి. ఆదాయ వ్య యంలో కుదింపు, మెరుగైన పన్ను తేలిక (బయోన్సీ) ఏకీకరణకు సహాయపడింది. కానీ, ప్రాథమిక లోటు (పీడీ 2023 1.8%కి పెరిగింది. 

ఆర్థిక ఆరోగ్యానికి కీలకమైన రెవెన్యూ లోటు 17 రాష్ట్రాల్లో కొనసాగింది. వాటిలో పంజాబ్ (3.2%), కేరళ (2.1%), ఆంధ్రప్రదేశ్ (2.7%) అత్యధికంగా ఉన్నాయి. ఇది ఆదాయ సమీకరణ, కట్టుబడి ఉన్న వ్యయ బాధ్యతలలో నిర్మాణాత్మక అసమతుల్యతను సూచిస్తుంది. జార్ఖండ్, ఒడిశా వంటి తక్కువ పన్నుతోపాటు జీఎస్‌డీపీ నిష్పత్తులు కలిగిన రాష్ట్రాలు వేగవంతమైన ఆదాయ వృద్ధిని సాధించాయి.

సొంత పన్ను ఆదాయం సగటున 0.86 (మహమ్మారికి ముందు) నుంచి 1.44 (మహ మ్మారి తర్వాత)కి మెరుగు పడింది. అయి తే, కేంద్ర గ్రాంట్ల వాటా 2022 23లో జీడీపీలో 2.5% నుంచి 2023 1.8%కి బాగా తగ్గింది. ఇది ప్రధానంగా జీఎస్‌టీ పరిహారం నిలిపి వేయడం, ఆర్థిక కమిషన్ బదిలీల తగ్గింపు కారణంగా ఉన్నట్టు తెలుస్తున్నది. 

జార్ఖండ్, ఒడిశా వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాలు జూలై 2024 సుప్రీంకోర్టు తీర్పునుంచి ఖనిజాలపై పునరాలోచన రాయల్టీ, పన్ను క్లెయిమ్‌లను అనుమతించడం ద్వా రా ప్రయోజనం పొందగలవు. ఈ లాభా లు 2026 తర్వాత మాత్రమే కార్యరూపం దాలుస్తాయి. అప్పటి వరకు, ఆదాయ కుదింపు ఒక బంధన పరిమితిగానే ఉం టుంది. ముఖ్యంగా పరిమిత ఆర్థిక సరళత్వాన్ని కలిగి ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు పరిస్థితి ఒకింత ఇబ్బందిగా ఉంది.

ముఖ్యంగా రుణాలను అక స్మాత్తుగా ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక ఒడుదొడుకులకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇది అంతర్గత వనరుల పెంపు లేకుండా కేంద్రం ద్వారా నడిచే మూలధన ప్రణాళికలపై అధికంగా ఆధారపడే రాష్ట్రాలకు వర్తిస్తుంది.

రుణభారాలను తగ్గించుకోవాలి

ముఖ్యంగా అత్యంత తీవ్ర ప్రమాదం రాష్ట్రాల రుణ గమన తత్వంలో ఉంటుంది. 2021లో జీడీపీలో 31% నుంచి 2023లో 28.2%కి తగ్గినప్పటికీ, రుణ- జీఎస్‌డీపీ నిష్పత్తి 2025 నాటికి మళ్లీ 28.8%కి పెరుగుతుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. సుమారు 25 కంటే ఎక్కువ రాష్ట్రాలు 25% పరిమితిని మించి పోతాయన్నది అంచనా. కానీ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెం గాల్ రాష్ట్రాలు ముఖ్యంగా అధిక రుణభారాలను ఒకవైపు మోస్తూనే మరోవైపు అధిక ఆర్థిక, ఆదాయ లోటులనూ కొనసాగిస్తున్నాయి.

ఇదే సమయంలో రుణాల కూర్పు కూడా మారిపోయింది. సుమారు 68.8% మేరకు బకాయిలు, మార్కెట్ రుణాలు, వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయి. కేరళ, పంజా బ్ వంటి రాష్ట్రాల్లో రుణ-సేవా నిష్పత్తి ఎక్కువగానే ఉంది. ఉత్పాదక వ్యయం కోసం ఆర్థిక భారాన్ని భరించవలసి వస్తున్నది. ఉదా॥కు పంజాబ్, ఆంధ్రప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అధిక ఆర్థిక లోటులు, బలహీనమైన ఆదాయ వ్యవహారాలు, నిలకడ లేని రుణ ప్రొఫైల్స్‌సహా బహుళ కోణాలలో పేలవమైన పనితీరును ఎదుర్కొంటున్నాయి.

పంజాబ్ రాష్ట్రం రుణసూచికలో సున్నా, ఆర్థిక ప్రూడెన్స్‌లో కేవలం 5.6 స్కోర్లను కలిగి ఉంది. ఇది వ్యవస్థాగత ఆర్థిక ఒత్తిడిని సూచిస్తునట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఈ రకమైన అసమానతలు రాష్ట్రాలు కేంద్రం నడుమ పాలనా నమూనాలు, వనరుల నిధులు, రాజకీయ ప్రోత్సాహకాలలో అంతర్లీన వ్యత్యాసాలను సూచిస్తాయి. 

నిర్మాణాత్మక వ్యూహాలు అవసరం

ఉపజాతి రుణ సంక్షోభాన్ని నివారించడానికి భారత రాష్ట్రాలు తమ ఆర్థిక వ్యూహా లను కొన్నింటిని కీలక కోణాలలో అత్యవసరంగా పునఃసమీక్షించుకోవాల్సి వుంది. వాటిలో ఆదాయ పెంపుదల, వ్యయ పునః సమతుల్యం, రుణ నియంత్రణ వంటివి. ఆదాయ రంగంలో, రాష్ట్రాలు ఖనిజ రా యల్టీలు, వినియోగదారు చార్జీలు, భూమి ద్రవ్యీకరణ వంటి నిరుపయోగంగా ఉన్న పన్నుయేతర ఆదాయాలను ఉపయోగించడం ద్వారా జీఎస్‌టీని దాటి తమ ఆదా య వనరులను వైవిధ్య పరచాలి.

ఉదా॥ కు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు మైనింగ్ ప్రీమియంలను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాయి. ఇవి వారి ఆదాయ రసీ దులలో 20% కంటే ఎక్కువ ఉన్నా యి.  రాష్ట్రాలు ఆదాయం, మూలధన వ్యయాల మధ్య అసమతుల్యతను పరిష్కరించుకోవాలి. అధిక రెకో నిష్పత్తులు అభివృద్ధి పె ట్టుబడుల ఖర్చుతో తరచుగా సబ్సిడీలు, ఉచితాల ద్వారా నిర్వహించే ఆదాయ వ్య యం విధానాలు వక్రతను సూచిస్తాయి. 

చివరగా, విశ్వసనీయ ఆర్థిక బఫర్లను నిర్మించడం చాలా అవసరం. మీడియం- టర్మ్ ఫిస్కల్ ఫ్రేమ్‌వర్క్ (ఎంటీఎఫ్‌ఎఫ్)లను స్వీకరించడం, రిస్క్-వెయిటెడ్ గ్యారెంటీ రిజిస్టర్లను ప్రచురించడం, రుణ స్థిరత్వ పరిమితులకు కట్టుబడి ఉండటం వంటివి మార్కెట్‌లో విశ్వాసాన్ని పెంచుతాయి. ఫలితంగా రుణఖర్చులు కూడా తగ్గుతాయి. త ద్వారా ఆర్థిక క్రమశిక్షణ మరింత మెరుగవుతుంది. ఆర్థికంగా సరైన దిశలో వెళ్ళ డానికి రాష్ట్రాలకు ఇంకా సమయం ఉంది. కానీ, పరిస్థితులు వేగంగా విషమిస్తున్నాయన్న సంగతిని మాత్రం మనం మరవవద్దు.