27-05-2025 12:00:00 AM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలయ్యింది. మధ్యలో వచ్చిన లోక్సభ ఎ న్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా బీఆర్ఎస్ గెలవలేక పోయింది. తదనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉంది. బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏండ్ల పాలన చూసే మార్పుకోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్ప చెప్పారు. గత ఎన్నికల్లో ఎందువల్ల ఓటమి పాలయ్యారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలదే తప్పు అన్నట్లుగా వ్యవహరించడం సరి కాదు.
కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ గత నెలలో ఘనంగా రజతోత్సవ వేడుకల్ని జరుపుకుంది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచి రెండుసార్లు తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన ఆ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షానికి పరిమితం అయింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ అనుభవంతో సలహాలు, సూచనలు ఇస్తూ రాష్ట్ర పురోభివృ ద్ధికి తోడ్పడాలని సీఎం రేవంత్రెడ్డి అసెం బ్లీ సాక్షిగా విజ్ఞప్తి చేశారు.
అయినా, కేసీఆర్ ఫార్మ్హౌస్ దాటి బయటకు రావడం లేదనే విమర్శలను అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రజతోత్సవ సభద్వారా మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో పునర్వైభవం సాధించగలమనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. గతంలో పార్టీ సభావేదికలపైన కేసీఆర్ ఫొటోతోపాటు అమరుల స్థూపం, ఇతర ముఖ్య నాయకుల ఫొటోలు, పార్టీ గుర్తు ఉండేది.
కానీ ఈ సభావేదికపైన ఉన్న ఫ్లెక్సీలో కేసీఆర్తోపాటు కేటీఆర్ ఫొటో మాత్రమే వేశారు. ఇక్కడే కాదు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వివిధ పత్రికలకు, టీవీలకు ఇచ్చిన ప్రచార ప్రకటనల్లో కూడా హరీష్రావు, కవిత ఫొటోలకు ప్రాధాన్యం లేకుండా చేశారనే చర్చ జరుగుతున్నది.
2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మొదలుకుని నేటివరకు కేసీఆర్ వెన్నంటే హరీష్రావు ఉన్నారు. కేటీఆర్ 2009లో సిరిసిల్ల నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచేసరికే ఆయనకు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి రెండుసార్లు పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతుగా కీలక పాత్రను హరీష్రావు పోషించారు.
ఆయనకు సముచిత గౌరవం దక్కట్లేదనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే, ఇదంతా కేసీఆర్ రాజకీయ వ్యూహమా! లేదా నిజంగానే ఆయనను పొమ్మన లేక పొగ పెడుతూ పార్టీనుంచి దూరం చేస్తున్నారా? అన్నటువంటి వార్తలు వచ్చినపుడల్లా వాటిని ఖండిస్తూ ‘తాను పార్టీలోనే కొనసాగుతానని’ ఆయన ప్రకటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హరీష్రావు ఎప్పుడూ మాట్లాడని విధంగా కేటీఆర్కి పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తే తాను మద్దతు ఇస్తానని చెప్పడం వంటి మాటలు కూడా కొత్త ఊహాగానాలకు తెర తీశాయి.
కవిత పయనం ఎటువైపు?
కల్వకుంట్ల కవిత ‘భారత జాగృతి’ పేరుపైన సొంత కేడర్తో కార్యక్రమాలు నిర్వహించడం, బహుజన, బీసీ కులసంఘాల మీటింగుల్లో తరచుగా పాల్గొనడం, ‘భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని’ మాట్లాడటం, రజతోత్సవ సభ జరిగిన తీరుతెన్నులు, ప్రజలనుంచి వచ్చిన పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ తండ్రికి అంతర్గతంగా రాసిన లేఖ బహిర్గతం కావడం, ఆ లేఖను తానే రాశానని చెప్తూ కేసీఆర్ తమ నాయకుడు అంటూనే పార్టీలో కోవర్టులు ఉన్నారనడం..
ఇవన్నీ అందరి దృష్టిని ఆకర్షించే రాజకీయ ఎత్తుగడలా? లేక నిజంగానే ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ పరిణామాలే రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుందా అన్న సందేహాలకు తావిస్తున్నాయి.
రజతోత్సవ సభ జరిగింది కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్కి పట్టాభిషేకం చేయడానికేనని ప్రజలు భావిస్తే, రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమని చెబుతూ భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు.
బీజేపీ, కాంగ్రెసేతర కూటమిగా బీఆర్ఎస్ ఏర్పడాలని ఆయన భావించారు. అయితే, ఇది పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తు తం ఎన్నికలకు ఇంకా మూడున్నర ఏండ్ల సమయం ఉన్నది. ఈలోపు బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ చేపడితే, పార్టీ ఏర్పాటైన నాటినుంచి కీలకంగా వ్యవహరించిన నేతలు కేటీఆర్ వెంట నడుస్తారా లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఆత్మ పరిశీలన అవసరం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలయ్యింది. మధ్యలో వచ్చిన లోక్సభ ఎ న్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా బీఆర్ఎస్ గెలవలేక పోయింది. తదనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉంది. బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏండ్ల పాలన చూసే మార్పుకోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్ప చెప్పారు. గత ఎన్నికల్లో ఎందువల్ల ఓటమి పాలయ్యారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలదే తప్పు అన్నట్లుగా వ్యవహరించడం సరి కాదు.
ఈ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకున్నా, ప్రభుత్వ విధి విధానాలు నచ్చకున్నా ప్రజలు మళ్ళీ మార్పు కోరుకోవడం సహజం. అప్పటి వరకు ప్రభుత్వానికి ఒక బాధ్యతాయుత ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది. జాతీయ పార్టీలకు జాతీ య అంశాలే తొలి ప్రాధాన్యంగా ఉంటా యి. ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి, ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందువరుసలో నిలిచేవి ప్రాంతీయ పార్టీలే అన్న అభిప్రాయం ప్రజల్లో బలం గా ఉంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో ప్రాంతీయ పార్టీల పాత్రే కీలకమన్న విషయం తెలిసిందే.
దక్షిణాది రాష్ట్రాల రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే కులం, మతం, వర్గం, ప్రాంతం, భాష మొదలైన అంశాల చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమై ఉన్న సంగతి ప్రస్ఫుటమవుతుంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతీయ పార్టీ లు (టీడీపీ, వైసీపీ, జనసేన) ఉన్నాయి.
వాస్తవానికి రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్, పార్టీ పేరునుంచి తెలంగాణ పదాన్ని తొలగించి భారత రాష్ట్ర సమితిగా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.
వ్యాసకర్త సెల్: 9959046499