17 June, 2026 | 12:21 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

ముంబై తండ్లాట తీరేనా!

05-10-2024 12:00 AM

పటిష్ట స్థితిలో రహానే సేన

ఇరానీ కప్

లక్నో: ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పటిష్ట స్థితిలో నిలిచింది. నేడు ఆటకు ఆఖరి రోజు కావడం.. ముంబై ఆధిక్యంలో ఉండడంతో ఆ జట్టు విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

సర్ఫరాజ్ (9*), తనుశ్ కొటియన్ (20*) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ముంబై ప్రస్తుతం 274 పరుగుల ముందంజలో ఉంది. అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 289/4తో ఇన్నింగ్స్‌ను ఆరం భించిన రెస్టాఫ్ ఇండియా 416 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్ (191) తృటిలో డబుల్ సెంచరీ మిస్సవ్వగా.. ధ్రువ్ జురేల్ (93) సెంచరీ చేజార్చుకున్నాడు.

ముంబై బౌలర్లలో తనుశ్, షామ్స్ ములానీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.  నేడు చివరి రోజు కావడంతో మ్యాచ్‌లో ఫలితం తేలడం కష్టమే. ఒక వేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్టును విజేతగా ప్రకటించనున్నారు.