5 May, 2026 | 2:58 AM

అంబులెన్స్‌లోనే మహిళ సుఖ ప్రసవం

05-05-2026 12:49 AM

అయిజ, మే 4: అయిజ మండలంలోని తుంకుంట గ్రామానికి చెందిన మహిళ 108 లో సిబ్బంది సహకారంతో అంబులెన్సు లోనే సుఖ ప్రసవం జరిగిందని ఏమర్జెన్స్ టెక్నీషన్ ఇశ్రాయిలు తెలిపారు. వివరాలలోకి వెళితే అయిజ మండలం లోని తుంకుంట గ్రామం నుండి పురిటి నొప్పులతో బాధపడుతున్న కీర్తన ఇంటినుండి 108 కి చరవాణి ద్వారా సమాచారం రావడంతో సమాచారం అందుకున్న అయిజ సిబ్బంది తూంకుంటకు వెళ్లి గర్భిణీ స్త్రీ నీ అంబులెన్సులో తీసుకొని వస్తుండగా మార్గ మధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడం జరిగిందని అన్నారు.

ఇది గ్రహించిన సిబ్బంది టెక్నీషన్ ఇశ్రాయేలు, శ్రీధర్ లు వెంటవచ్చిన మహిళల సహకారంతో పురుడు పోయాగ కీర్తన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని సిబ్బంది తెలిపారు. అనంతరం స్థానిక అయిజ పి హెచ్ సి కి తరలించి చేర్పించగా డాక్టర్లు తల్లి బిడ్డ క్షేమం గా ఉన్నారని తెలుపడంతో  బంధువులు గ్రామస్తులు ఆనందం తో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సిబ్బందికి కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.