1 June, 2026 | 11:35 AM

Breaking News

బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •   ప్రజాసంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను ఖండించిన సీపీఎం   •  

రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి

01-06-2026 11:02 AM

షాద్ నగర్ జూన్ 1 (విజయక్రాంతి): రామేశ్వరం  కోనేరులో ఓ మహిళ పడి మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. నందిగామ మండలంలోని శ్రీనివాసుల గూడా గ్రామానికి చెందిన జన్ముల సువర్ణ (45) రాత్రి పున్నమి సందర్బంగా రామేశ్వరం దర్శనర్థం వచ్చింది. తెల్లవారుజామున కోనేరులో స్నానం చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కోనేరులో జారిపడింది. ఇది గమనించిన భక్తులు అక్కడికి చేరుకొని సువర్ణని బయటకు తీయగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న షాద్ నగర్ పోలీసులు,  మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వం ఆస్పత్రికి  తరలించారు.