calender_icon.png 22 June, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

21-06-2025 06:23:23 PM

వనపర్తి టౌన్: మహిళలు వ్యాపార రంగంలో ముందుకు వచ్చి స్వయం ఉపాధితో ఆర్థికంగా సాధికారత సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) సూచించారు. శనివారం ఉదయం ఆర్డిఓ కార్యాలయ ప్రాంగణంలో మెప్మా ద్వారా మీనాక్షి మహిళా సంఘం క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మహిళలు స్వయం ఉపాధి ద్వారా మహిళా సాధికారత సాధించేందుకు మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు.

ఇందులో భాగంగానే క్యాంటీన్ లు, పెట్రోల్ బంక్, సిమెంట్ ఇటుకల తయారీ, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రణాళికతో ముందుకు వచ్చి వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. ఈ ప్రారంభం కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పి డి  డి.ఆర్ డి ఓ ఉమాదేవి, మెప్మా డి.ఎం.సి బాలరాజ్, మెప్మా సిబ్బంది మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.