14-06-2025 05:07:57 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో వారం రోజులుగా బుడగ జంగాల కాలనీ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. శనివారం తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహిళలు బోధన్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.