14-06-2025 05:06:31 PM
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.హెచ్.వి.ఆర్.ఆర్ వరప్రసాద్..
కామారెడ్డి (విజయక్రాంతి): లోక్ అదాలత్ ల ద్వారా కేసులను సత్వరంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ విఆర్ఆర్ వరప్రసాద్(Lok Adalat Chairman Dr. CH VRR Varaprasad) తెలిపారు. శనివారం కామారెడ్డి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, లోక్ అదాలత్ చైర్మన్ వరప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.... లోక్ అదాలత్ కేసు పరిష్కారం అయి అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు.
చీటింగ్ కేసులు, సైబర్ కేసులు, బ్యాంకు ప్రీ లిటిగేషన్ కేసులు , చెక్ బౌన్స్ కేసులు ఈ లోక్ అదాలత్ లో పరిష్కారం చేసుకోవచ్చు అని తెలిపారు. భార్య, భర్తల కేసులు కూడా పరిష్కారం చేయబడుతుందన్నారు. భార్య భర్తలతో మాట్లాడి వారిని రాజి కుదిరిచి కలపడానికి ప్రయత్నించడం జరుగుతుందన్నారు. రాజి చేయడం వాళ్ళ వాటికి సంబంధించిన మిగతా కేసులు కూడా పరిష్కారం అయినట్టే అన్నారు. 498 ఐపీసీ కేసులలో కూడా మొదట పోలీస్ వాళ్ళు కేసు ఫైల్ చేయకుండా జాతీయ కోర్టు చెప్పిన విధంగా మొదట వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారని భావిస్తున్నాను అని తెలిపారు. జిల్లా లోక్ అదాలత్ సెక్రటరీ ట్.నాగరాణి మాట్లాడుతూ.. కేసుల పరిష్కారానికి ఇరు పార్టీలకి కౌన్సిలింగ్ చేసి పరిష్కరిస్తున్నారని అన్నారు.
DLSA సెక్రటరీ ట్.నాగరాణి మాట్లాడుతూ.. వీలైనంత ఎక్కువ కేసులు పరిష్కారం చేసి జిల్లా కి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. జిల్లా అడిషనల్ సూపెరింటెండ్ అఫ్ పోలీస్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని జిల్లా పోలీస్ లకి సూచనలు కూడా ఇచ్చామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్ మాట్లాడుతూ.. మా న్యాయవాదులందరు పూర్తి సహకారం ఇస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి , సీనియర్ సివిల్ జడ్జి Dr సుమలత , జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి దీక్ష, జిల్లా అడిషనల్ సూపెరింటెండ్ అఫ్ పోలీస్ నర్సింహా రెడ్డి , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద రమేష్ , పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజా గోపాల్ గౌడ్ , APP దామోదర్ రెడ్డి , సూర్య ప్రకాష్,సర్కిల్ ఇన్స్పెక్టర్లు చంద్ర శేఖర్ రెడ్డి, సంపత్ కుమార్, న్యాయవాదులు శంకర్ రెడ్డి, దేవరాజ్ గౌడ్, శ్రీధర్, శ్యామ్ గోపాల్ రావు , చింతల గోపి, న్యాయ శాఖా సిబ్బంది భుజంగ్ రావు , శ్రీధర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కామారెడ్డి సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.