calender_icon.png 20 June, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాలు కురవాలని మహిళల బతుకమ్మ ఆట

19-06-2025 08:03:56 PM

దౌల్తాబాద్: వర్షాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా విత్తనాలు వేసినప్పటికీ సరైన వర్షాలు లేక అవి మొలకెత్తడం లేదని అన్నదాతలు ఆకాశం వైపు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. రాయపోల్ మండలం(Raipole Mandal) కొత్తపల్లి గ్రామంలో పంటలు రక్షించుకోవడానికి వర్షాలు కురవాలని మహిళలు బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. రోహిణి కార్తే మొదలుతోనే వర్షాకాలం మొదలవుతుందని రైతులు అందరూ దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు.

అడపాదడపా కురిసిన వర్షాలకు చాలామంది రైతులు విత్తనాలు వేశారు. కానీ జూన్ మాసంలో సరైన వర్షాలు కురవక వేసిన పూర్తిస్థాయిలో మొలకెత్తడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలతో ఈసారి వాన కాలంలో ముందస్తుగానే వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ సరైన వర్షాలు కురవడం లేదు. వేల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి విత్తనాలు వేశామని, తీరా విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు కురవడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వర్షాలు కురిస్తే మేము వేసిన విత్తనాలు మొలకెత్తుతాయన్న ఆశతో రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు.