19-06-2025 07:57:32 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వర్కట్ పని గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) వలిగొండ మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ వికసిత్ భారత్ కార్యశాల సమావేశంలో వలిగొండ మండలానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్ వలిగొండ మండల ప్రధాన కార్యదర్శిగా లింగస్వామిని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ... తన ఎన్నికకు సహకరించిన మండల పార్టీ అధ్యక్షుడికి, మండలంలోని జిల్లా, మండల నాయకులకు, పార్టీ సీనియర్ నాయకులకు, బూత్ అధ్యక్షులకు, కార్యకర్తలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.