calender_icon.png 16 November, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల సంక్షేమానికి పనిచేయండి

16-11-2025 12:16:12 AM

అధికారులకు మంత్రి అడ్లూరి ఆదేశాలు

భద్రాచలం, నవంబర్ 15 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని గిరిజన, ఎస్సీ వెల్ఫేర్, గురుకుల, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలు, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల సం బంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తప్పనిసరిగా ఆ పాఠశాలలను సందర్శించి, వారి సంక్షేమానికి కృషి చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమం, వికలాంగులు, సినియర్ పౌరు లు, లింగ మార్పిడి సాధికారత శాఖల మం త్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.

శనివారం ఐటీడీఏ సమావేశం మందిరంలో ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలపై జిల్లా, యూనిటీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజులలో ప్రతి ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రతి పాఠశాలలకు సమస్యలు లేకుండా చూస్తామని, విద్య పరంగా ఎన్ని నిధులైన కేటాయిస్తామని అన్నారు.

జెసి మరియు ఆర్డీవో, జిల్లా స్థాయి అధికారి నుండి ప్రతి ఒక్కరూ 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని పాఠశాలలను విజిట్ చేసి పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులను వారి సమస్యలను తెలుసుకొని ప్రతి ఇన్స్టిట్యూషన్లో మెడికల్ క్యాంపులు నిర్వహించేలా చూడాలని అన్నారు. భవిష్యత్తులో ఐటీడీఏలకు రావలసిన అన్ని శాఖల గ్రాంట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొని పోయి వచ్చేలా చూస్తామని, ఉపాధ్యాయులపరంగా, గిరిజన గ్రామాల రోడ్ల సమస్య లు, అన్ని పాఠశాలల్లో పక్కాభవనాల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిం చడానికి కృషి చేస్తానని అన్నారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నేతృత్వంలో ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు విద్యా వైద్యం, స్కిల్ డెవలప్మెంట్, కెరీర్ గైడెన్స్, మ్యూజియం అభివృద్ధి, ఉద్దీపకం, ఫారెస్ట్ పోడు భూము ల సమస్యలు, గిరిజన గ్రామాలలో ఇంజనీరింగ్ ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, నెలకొన్న సమస్యల గురించి ఐటీడీఏ పీవో బి రాహుల్ మంత్రి దృష్టికి తీసుకొని పోయారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు బలరాం నాయక్, రాం సహాయంరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణరెడ్డి, గిరిజన సంక్షేమ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, టి సి ఆర్ టి ఐ డైరెక్టర్ సమూజ్వాలా, ట్రై కార్ జిఎం శంకర్రావు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.