calender_icon.png 7 June, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో పనిచేయండి

06-06-2025 01:00:41 AM

  1. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి..
  2. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
  3. మూడు పార్లమెంటరీ సెగ్మెంట్ల నేతలతో సమీక్ష
  4. అర్హులందరికీ పదవులు: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ‘పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపుని చ్చారు. తద్వారా ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని సూచించారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం నాగర్‌క ర్నూల్, మహబూబ్‌నగర్, వరంగల్  పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రె స్ నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలు, నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ, భూభారతి చట్టంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని పేర్కొన్నారు.

యావత్ దేశాన్ని ఆయా అంశాలు ఆశ్చర్యపరుస్తున్నాయని వెల్లడించారు. అనంతరం ఆమె అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, స్థాని క సంస్థల ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కార్యకర్తలు, నేతలు ప్రజలకు వివరించాలని సూచించా రు. సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు.

ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. పార్టీ కమిటీల నియామకాలు ఆలస్యమవుతున్నందున కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్లారనే మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అధిష్ఠానం త్వరలోనే అర్హత ఉన్నవారందరికీ పదవులు కట్టబెడుతుందని హామీ ఇచ్చారు.

17 నెలల కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని, రానున్న స్థానిక ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేల పనితీరుపైనా ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సమా వేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ మం త్రి చిన్నారెడ్డితో పాటు మూడు పార్లమెంటరీ నియోజక వర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. 

ఎంపీ మల్లు రవిపై మీనాక్షికి ఫిర్యాదు

అలంపూర్ నియోజకవర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిపై ఫిర్యాదు చేశారు. ఎంపీ అలంపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులను పట్టించుకోవడం లేద ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజేయుడితోపాటు ఆ పార్టీ నాయకులను ప్రోత్సహించే పనిలో ఉన్నారని ఆరో పించారు. ఎంపీ పోకడలు పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయని వాపోయారు. ఎంపీ రెండు రోజుల క్రితం అలంపూర్‌కు వచ్చి కాంగ్రెస్ నాయకులను పట్టించుకోకుండా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తన కారులో కూర్చొపెట్టుకున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని వాపోయారు.