29 August, 2026 | 8:39 PM

Breaking News

మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్   •   సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •  

జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల పనులు పకడ్బందీగా చేపట్టాలి

29-08-2026 07:05 PM

జైపూర్, (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల పనులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం కుందారం గ్రామ పంచాయతీలో జలసిరి కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పంట కుంట పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూగర్భ నీటిమట్టాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు. పంట కుంట పనులలో పాటించాల్సిన జాగ్రత్తలు, పనుల పురోగతి అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని తెలిపారు.

అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులతో పాటు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణ తీరును పరిశీలించి, ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన వ్యక్తులు సంబంధిత స్థాయి అధికారులను సంప్రదించి అవసరమైన వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్,  టి.ఎ., క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.