29 August, 2026 | 8:12 PM

సన్న వడ్ల బోనస్‌ కు సెప్టెంబర్ 10 ఆఖరు

29-08-2026 07:07 PM

సుల్తానాబాద్ వ్యవసాయ అధికారి పైడితల్లి

సుల్తానాబాద్,(విజయ క్రాంతి​): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో సన్న రకం వడ్ల బోనస్ పొందేందుకు రైతులు విత్తన కొనుగోలు పత్రాలను స్థానిక ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలని, అధికారిక డీలర్లు లేదా సొంత సీడ్ ప్లాంట్ల రశీదులను సెప్టెంబర్ 10 లోపు సమర్పించాలని మండల వ్యవసాయ అధికారి పైడితల్లి శనివారం తెలిపారు.

వానాకాలం పండించిన పంట ప్రభుత్వ విక్రయా కేంద్రంలో విక్రయించుటకు గ్రామ వాలంటీర్ ద్వారా పంట నమోదు ప్రక్రియ తప్పనిసరి. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం దక్కేలా అధికారులుపనిచేస్తున్నారు అని, నిబంధనల ప్రకారం గడువులోగా వివరాలు సమర్పించాలని స్పష్టం చేశారు.

వాలంటీర్ ద్వారా పంట నమోదు తప్పనిసరి

​పంట దిగుబడిని అధికారిక కొనుగోలు కేంద్రాలలో విక్రయించడానికి గ్రామ వాలంటీర్ ద్వారా క్షేత్రస్థాయి పంట నమోదు చేయించుకోవడం తప్పనిసరి. సాగు విస్తీర్ణం, రకం వివరాలను కచ్చితంగా నమోదు చేసినప్పుడే ధాన్యం విక్రయాల సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తవని ఏవో స్పష్టం చేశారు.