calender_icon.png 13 June, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదు

12-06-2025 07:54:45 PM

న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి..

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు కోర్టు ఆవరణలో గురువారం ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినోత్సవ సందర్భంగా ఇల్లందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇల్లందు మండల న్యాయ అధికార సంస్థ చైర్మన్ దేవరపల్లి కీర్తిచంద్రిక రెడ్డి(Judge Devarapalli Keerthi Chandrika Reddy) హాజరైనారు. అనంతరం జరిగిన సదస్సులో వారు ప్రసంగిస్తూ ఈ న్యాయ సదస్సుల ద్వారా గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి  బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి మన వంతు కృషి చేయాలని వారు తెలిపారు.

అదేవిధంగా చాలావరకు తల్లిదండ్రులకు వారి ఆర్థిక పరిస్థితి  స్తోమత  లేనందున పిల్లల్ని కూడా పనులకు పంపిస్తున్నారని, చాలామంది పిల్లలు మన కళ్ళముందే పనిచేస్తున్న చూసి చూడనట్టు  ఉండడం కూడా మన తప్పు అని మనకు కూడా బాధ్యత ఉండాలని బాల కార్మికులను అని తెలిసి పనిలో పెట్టుకున్నట్లు మా దృష్టికి వస్తే యజమానిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని,  సమాజంలో  ఉంటున్నందున మనం కూడా మన వంతు బాధ్యతగా  చైల్డ్ హెల్ప్ లైన్ 1098  కాల్ చేసే  బాధ్యత అందరి మీద ఉంటుందని ఈ సందర్భంగా తెలిపినారు.

అదేవిధంగా న్యాయ చైతన్య సదస్సు ఆధ్వర్యంలో ముందు ముందు గ్రామస్థాయిలో, ఇల్లందు పట్టణస్థాయిలో బాల కార్మిక వ్యవస్థ  నిర్మూలించడానికి సదస్సులను ఏర్పాటు చేస్తామని, ఎవరైనా బాల కార్మికులను పనిలో పెట్టుకున్నట్లయితే శిక్షార్హులవుతారని, ఈనెల 14వ తారీఖున జరగబోయే జాతీయ లోక్ అదాలత్ వచ్చి రాజీ పడదగిన కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారు తెలిపినారు.  ఈ కార్యక్రమంలో జడ్జి గారితో పాటు ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాంపల్లి ఉమేశ్వరరావు,   ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సీనియర్ న్యాయవాది పిరమిడ్ వెంకటేశ్వర్లు,  కోర్టుసిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.