21-06-2025 05:31:43 PM
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అభినవ్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవం(International Yoga Day) సందర్భంగా యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. యోగాతో ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. యోగతో ధ్యానం శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఏకాగ్రతను పెంచేలా చేస్తుంది, అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం శనివారం ముప్పెనపల్లి గ్రామంలో దోమల మందు పిచికారి చేయడం జరిగింది. డ్రైడే కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఇందులో హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్ ఏఎన్ఎం కవిత మరియు ఆశా కార్యకర్తలు స్వప్న సవిత రాజేశ్వరి కోమల పాల్గొన్నారు.