08-05-2025 01:30:26 AM
కొత్తపల్లి, మే 7 : కరీంనగర్ పట్టణం 19వ డివిజన్ విజయపురి కాలనీ హనుమాన్ దేవాలయంలో బిజెపి రాష్ర్ట పార్టీ సూచన మేరకు భారత్ పాకిస్తాన్ పై యుద్ధం గెలవాలని బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి పొన్నాల రాములు, బీజేపీ సీనియర్ నాయకులు కొంగల రాజిరెడ్డి, బూత్ అధ్యక్షులు నాంపల్లి శంకర్, బండ రాకేష్, రవీందర్, టి శంకరాచారి, గోదరి నరేష్, హనుమాన్ దీక్షా పరులు తదితరులు పాల్గొన్నారు.