12-11-2025 06:42:02 PM
కుబీర్ (విజయక్రాంతి): కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల సందర్భంగా బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. రెండవ పండరిపురంగా పేరుపొందిన విఠలేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తారు. ఆలయాన్ని మండల అధికారులు సాగర్ రెడ్డి స్థానిక నాయకులు భక్తులు సందర్శించి పూజలు నిర్వహించారు. అంతకుముందు వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.