2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

10-03-2026 04:48 PM

రొయ్యూరు పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు

విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలి

రొయ్యూరు గ్రామ సర్పంచ్ కావిరి అర్జున్ 

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వం పాఠశాలను రొయ్యూరు గ్రామ సర్పంచు కావిరి అర్జున్ సందర్శించారు పాఠశాల ఫరిషారాలను పరిశీలించి విద్యార్థులకు పెట్టె మధ్యాహ్నం భోజనంలో నాణ్యతగా ఉండాలన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేసి పౌష్టికహారం బియ్యం పప్పు బాలామృతం గుడ్లు పాలు వంటి సరుకులు నాణ్యతగా ఉన్నవి పిల్లలకు అందించాలని అంగన్వాడీ రిజిస్టర్ ను పరిశీలిచడం జరిగింది.

ఈసందర్భంగా సర్పంచ్ కావిరి అర్జున్ మాట్లాడుతూ త్రాగునీటి కేంద్రాన్ని, వంటగదిని, భోజనం, స్టోర్ రూమ్, కూరగాయలను క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, అంగన్వాడీ పిల్లల పౌష్టికహారం విషయంలో ఏ చిన్న తప్పు జరిగిన సాహించేది లేదని వారికీ ప్రతిరోజు నాణ్యమైన ఆహారం అందిచాలని అంగన్వాడీ టీచర్స్ నీ పాఠశాల ఉపాధ్యయులని ఆదేశించారు ఈ కార్యక్రమములో వార్డు సభ్యులు కొండగొర్ల తిరుపతి కార్యదర్శి వీరు నాయక్ గ్రామ పెద్దలు తదితరులు పాలుగోన్నారు