07-06-2025 08:41:50 PM
కామారెడ్డి ఎస్పి రాజేష్ చంద్ర..
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణకు చెందిన యువకుడు పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) అన్నారు. “హర్ శిఖర్ పర్ తిరంగా” మిషన్లో భాగంగా మిజోరాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఎత్తైన శిఖరాలను విజయవంతంగా అధిరోహించిన యశ్వంత్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను కలిశారు.
యశ్వంత్ ప్రతి శిఖరంను అధిరోహిస్తూ శిఖరంపై భారత త్రివర్ణ పతాకంతో పాటు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఫోటోను ప్రదర్శించి వారి నిస్వార్థ సేవకు గౌరవం తెలిపాడు. ఈ సందర్భంగా భుక్య యశ్వంత్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను శనివారం కామారెడ్డిలో లో కలిశారు. వారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, అధిరోహించిన శిఖరాలపై తీసిన ఫోటోల ను ఎస్పీకి అంద చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, భుక్య యశ్వంత్ను అభినందిస్తూ, "యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యశ్వంత్ సాధన గర్వకారణం అని తెలిపారు.
అదే విధంగా అతను భవిష్యత్తులో మరింత ఎత్తైన శిఖరాలను అధిరోహించాలని ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. యశ్వంత్ ఇప్పటివరకు మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా), మౌంట్ ఎల్బ్రస్ (రష్యా), మౌంట్ కోసియస్కో (ఆస్ట్రేలియా), కాంగ్ యాట్సే II, యూనామ్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తదితర శిఖరాలను అధిరోహించాడు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని ఆ లక్ష్యసాధన విజయవంతం కావాలని ఎస్పీ ఆకాంక్షించారు.