07-06-2025 08:44:05 PM
కామారెడ్డి (విజయక్రాంతి): బక్రీద్(Eid al-Adha) పండుగ పర్వదినం సందర్భంగా కామారెడ్డిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(State Government Advisor Shabbir Ali)కి శనివారం పట్టణ కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావ్, లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆ భగవంతుడు షబ్బీర్ అలీకి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. వారు మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు తేవాలని, వారి కోరికలు నెరవేరాలని ఈ సందర్భంగా నాయకులు కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీ రాజా గౌడ్, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, జిల్లా ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు ఐరేని సందీప్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ రామ గౌడ్, ఎర్రవాటి శ్యామ్ గౌడ్, కిరణ్ ఇతర నాయకులు ఉన్నారు.