23-06-2025 01:10:26 AM
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): రాబోయే 4 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుము లు, మెరుపులతో వర్షాలు పడనున్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.