02-05-2025 01:26:47 AM
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): ఐదు రోజులపాటు తెలం గాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు ఈనెల 6 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మా ర్పులుండవని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలు లతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 30 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
శుక్రవారం మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.