calender_icon.png 20 June, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాతో ఆత్మ స్థైర్యం పెరుగుతుంది

19-06-2025 08:14:05 PM

గురుకుల పాఠశాలలో యోగా డే ఆసన కార్యక్రమం..

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల/పాఠశాలలో గురువారం యోగా డే(Yoga Day) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజాంసాగర్ మండల ఆయుర్వేద వైద్యాధికారి రత్నం ఆధ్వర్యంలో యోగ ట్రైనర్ క్రాంతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే ను పురస్కరించుకుని ముందస్తుగా విద్యార్థులకు పలు యోగా ఆసనాలు సూచించారు.

ఈ సందర్భంగా వైద్యాధికారి రత్నం మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా డే ను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. యోగాతో ఆత్మ స్థైర్యం పెరుగుతుందని, మానసికోల్లసం, జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడుతుందని అన్నారు. క్రమం తప్పకుండా రోజువారీ వ్యాయామంలో యోగా అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగ శిక్షణ బృందం, కళాశాల ప్రిన్సిపాల్ జనార్ధన్, ఎస్విపి. ప్రిన్సిపాల్ రవికాంత్, పి ఈ టి శ్రీధర్, పీడీ రాజు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.