17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాబోయే రోజుల్లో భారత్ ను విశ్వ గురువుగా చేయడమే మోదీ లక్ష్యం

19-06-2025 08:09 PM

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): భారతదేశాన్ని విశ్వ గురువుగా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkataramana Reddy) అన్నారు. గురువారం కామారెడ్డి నియోజకవర్గంలోని బిబిపేట్ దోమకొండ బిక్కనూర్ రాజంపేట మండలాల్లోని పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం భిక్కనూరు మండలం జంగంపల్లిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత భారత సంకల్ప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ బిజెపి జిల్లా అధ్యక్షులు అరుణతార ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. 

ఈ సందర్భంగా అరుణా తార మాట్లాడుతూ... నరేంద్రమోదీ గత 11 సంవత్సరాలుగా అనేక విజయాలు సాధించడం జరిగిందని ఆర్దికంగా, సాంస్కృతికంగా, దౌత్య పరంగా, అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించడంలో నరేంద్ర మోదీ విజయం సాధించారని అన్నారు. పల్లె నుండి పట్నం వరకు, గల్లి నుండి డిల్లీ వరకు జరిగిన ప్రతి అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వ వాట ఉందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించిందనీ, అదే స్ఫూర్తితో వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బిక్కనూరు మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.