21-06-2025 07:58:45 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని కట్టారాంపూర్ లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఈరోజు అనగా అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో ఈ యోగా దినోత్సవంను చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, ప్రస్తుత రోజుల్లో యోగా అనేది ఎంత ముఖ్యమో, యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు అనేది విద్యార్థులకు క్లుప్తంగా వివరించడం జరిగింది.
ఆ తర్వాత పాఠశాల యోగా టీచర్ గడ్డం మధు విద్యార్థులందరితో యోగాసనాలు వేయించి, యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అర్చన, ఇన్చార్జ్ సందీప్, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.