19-06-2025 01:25:39 AM
న్యూఢిల్లీ, జూన్ 18: పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందంలో మీ ప్రమేయం ఏమీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్ కాల్లో స్పష్టం చేశారు. జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ట్రంప్-మోదీ ద్వైపాక్షికంగా భేటీ కావాల్సి ఉన్నా ట్రంప్ అమెరికాకు వెళ్లిపోవడంతో వీరి భేటీ జరగలేదు. ఆ ఆ తర్వాత అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ మోదీకి ఫోన్ చేయగా.. ఈ ఇద్దరు నేతలు దాదాపు 35 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించుకున్నారు.
ఈ సందర్భంగానే ప్రధాని మోదీ పాక్తో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్ర ఏమీ లేదని, అసలు వాణిజ్య ఒప్పం దం ప్రస్తావనే రాలేదని ట్రంప్తో తెలిపారని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. జీ-7 సమావేశాల నుంచి తిరిగి వెళ్లేటపుడు అమెరికాలో ఆగాలని మోదీని ట్రంప్ ఆహ్వానించగా.. మోదీ సున్నితంగా తిరస్కరించారని కూడా మిస్రీ పేర్కొన్నా రు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం ఈ ఇద్దరు నేతలు చర్చించుకోవడం ఇదే తొలిసారి. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ ట్రంప్కు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో అండగా ఉంటామన్నారు.
‘త్వరలోనే ద్వైపాక్షికంగా భేటీ అవ్వాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయిం చుకున్నారు. త్వరలో భారత్లో జరిగే క్వాడ్ సమావేశానికి ట్రంప్ను మోదీ ఆహ్వానించారు. ఇందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు.’ అని మిస్రీ పేర్కొన్నారు.