07-06-2025 01:14:22 AM
కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటల
కమిషన్ ముందు..
* ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా నిధుల లేకపోవడంతో రుణాల సమీకరణ కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
* క్యాబినెట్ నిర్ణయం మేరకే రీడిజైనింగ్ చేశాం.
* క్యాబినెట్ సబ్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ టీం సూచనల మేరకే ప్రాజెక్టును షిఫ్ట్ చేశాం.
మీడియా ముందు..
* కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులకు నాకు సంబంధం లేదు. నీటిపారుదలశాఖలోని ఆర్థిక విభాగం ఆ లెక్కలు చూసుకుంది.
* క్యాబినెట్కు బాస్ కేసీఆర్..ఆయన ఆధ్వర్యంలోనే రీడిజైనింగ్ జరిగింది.
* కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బ్రెయిన్చైల్డ్..దానికి అన్నీ తానేనని, ఆయనే పలుమార్లు వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 6 (విజయ క్రాంతి): కేసీఆర్ నాయకత్వంలోని క్యాబి నెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని మాజీ ఆర్థికశాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సాంకేతిక కమిటీ, క్యాబినెట్ కమిటీ సిఫారసు మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను తేల్చేం దుకు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ విచారణలో భాగంగా శుక్రవారం ఈటల రాజేందర్ హాజరయ్యారు.
అయితే కమిషన్ ఎదుట చెప్పిన విషయాలకు, అనంతరం మీడియాతో వెల్లడించిన అంశాలకు విరుద్ధంగా ఉండటం గమనా ర్హం. పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సం బంధించిన పలు ప్రశ్నలు ఈటల రాజేందర్కు సంధించారు. ఎవరి నిర్ణయం మేర కు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను నిర్మించారని కమిషన్ ప్రశ్నించగా ఈటల రాజేందర్ సమాధానమిస్తూ.. కాళేశ్వరం కంటే ముందు తుమ్మడిహట్టి వద్ద చేవేళ్ల ప్రాణహిత పేరుతో రూ.38వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించినప్పటికీ సీడబ్ల్యూసీ, మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలి పారు.
వాస్తవానికి తుమ్మిడిహట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేకపోవడంతో కాళే శ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు పే ర్కొన్నారు. అయితే దీని కోసం అప్పటి సీ ఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్రావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏ ర్పాటు చేశారని, అందులో అప్పటి ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు, ఆర్థిక శాఖ మంత్రిగా తాను సభ్యులుగా ఉన్నామని తెలిపారు.
అన్ని అంశాల ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రూ. 65 వేల కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రభుత్వానికి తమ క్యాబినెట్ సబ్ కమిటీ నివే దిక ఇచ్చామని కమిషన్కు వివరించారు. రైతుల నుంచి అభ్యర్థనలు, డి మాండ్లను నెరవేర్చడంలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచినట్టు స్పష్టం చేశారు. ఆ త ర్వాత పెరిగిన నిర్మాణం వ్యయం గురించి తనకు తెలియదని కమిషన్కు తెలిపారు.
క్యాబినెట్ నిర్ణయం మేరకే బరాజ్ల నిర్మాణం..
బరాజ్ల నిర్మాణం పూర్తిగా క్యాబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని స్పష్టం చేశా రు. నిపుణుల కమిటీ నివేదిక గురించి కమిషన్ ప్రశ్నించగా గోదావరిపై చాలా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఈ బరాజ్ల నిర్మాణానికి నిపుణుల కమిటీ అంగీకరించిందని చెప్పారు. ప్రాజెక్టు డీపీఆర్ కోసం వ్యాప్కోస్ సంస్థకు రూ. 594.45 కోట్ల అందించిన విషయం గు రించి కమిషన్ ప్రశ్నించింది.
ఆ విషయం తనకు తెలియదని వివరించారు. కాళేశ్వ రం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు లక్ష్యం గురించి ఈటల రా జేందర్ను కమిషన్ ప్రశ్నించగా ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా నిధుల లేకపోవడంతో రుణాల సమీకరణ కోసం కేఐపీ సీఎల్ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశా రు. దీనికి ఆర్థిక శాఖకు ఎలాంటి సంబం ధం లేదని, కేఐపీసీఎల్ నిర్వహణ మొత్తం ఇరిగేషన్ శాఖ పరిధిలో కొనసాగిందని వెల్లడించారు.
రుణాలను ఏవిధంగా తిరిగి చెల్లిస్తామని బ్యాంకర్లకు చెప్పారని కమిషన్ ప్రశ్నించగా.. కేఐపీసీఎల్కు నీటి విని యోగదారుల నుంచి వచ్చిన ఆదాయం తో రుణాలను తిరిగి చెల్లిస్తామని ప్రభు త్వం చూపించినట్టు వివరించారు. బరాజ్ల నిర్మాణాల్లో అవలంబించిన ఆర్థిక క్రమశిక్షణ గురించి కమిషన్ ప్రశ్నించింది.
అయి దీనికి ఈటల సమాధానమిస్తూ... క్యాబినెట్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అనుసరించిందని తెలిపారు. దీంతోపాటు ఆర్థిక శాఖ కేవలం బడ్జెట్ కేటాయింపుల వరకు మాత్రమే పరిమితమైందని, ఎవరు ఎంత నిధులు విడుదల చేయాలో ఇరిగేషన్ శాఖ చూసుకున్నదని స్పష్టం చేశారు.
సమాచారమంతా వాళ్లిద్దరి దగ్గరే ఉంది..
కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారమంతా కేసీఆర్, హరీశ్రావు దగ్గరే ఉందన్నారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పారు. ప్రాజెక్టు వ్యవహారంలో తన పాత్రేమీ లేదని తెలిపారు. ప్రాజె క్టు రీ డిజైనింగ్ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారని, దీనికి అప్పటి నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు చైర్మన్గా వ్యవహరించారని చెప్పారు.
ఆనకట్టల నిర్మాణం సాంకేతిక నిపుణులకు చెం దిన అంశమని, ఆ నిర్మాణంపై రాజకీయ నాయకులకు ఏం తెలి యద న్నారు. నా కణతపై తుపాకీ పెట్టినా సరే, నిజమే మాట్లాడుతానని, తప్పుఒప్పులు ఎవరివో తెలంగాణ ప్రజ లు తేలుస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు తన మానస పుత్రిక అని కేసీఆర్ వందల సార్లు చెప్పారని, అప్పుడు నిర్ణయం తీసుకున్న సమయంలో క్యాబినెట్కు బాస్ కేసీఆరేనని స్పష్టం చేశారు.