16-05-2025 10:14:32 AM
హైదరాబాద్: ఉన్నత చదువులు చదివిన ఆ యువకుడికి నిరాశే దక్కింది. నగరంలోని అంబర్ పేట్ పోలీస్ స్టేషన్(Amberpet Police Station) పరిధిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సరైన ఉద్యోగం రాలేదని ఉరేసుకుని ఇందిరానగర్ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఎంబీఏ పూర్తి చేసినా.. కోరుకున్న ఉద్యోగం రాలేదని మహ్మద్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.