17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఆడపిల్ల పుట్టిందని హత్య చేసిన తండ్రి

16-05-2025 11:11 AM

గోల్కొండ : హైదరాబాద్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతి కరమైన సంఘటనలో 35 ఏళ్ల వ్యక్తి తన 14 రోజుల కూతురిని హత్య చేశాడు. గోల్కొండ(Golconda) ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. జగత్ విశ్వకర్మగా గుర్తించబడిన నిందితుడు ఈ దారుణమైన నేరానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. బతుకుదెరువు కోసం నేపాల్‌ నుండి వచ్చిన జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు గోల్కొండ పోలీస్ స్టేషన్(Golconda Police Station) పరిధిలోని ఒక అపార్టుమెంటులో వాచ్ మెన్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దంపతులకు  కొడుకు, కూతురు ఉండగా, అనారోగ్యంతో కొడుకు చనిపోయాడు.

14 రోజుల క్రితం గౌరీకి ఆడపిల్ల జన్మించగా, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిళ్ళలో నిద్రపోతున్న పసికందును బయటకు తీసుకువెళ్లి కత్తితో గొంతుకోసి చిన్నారి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి పెట్టాడు. గంట తరువాత నిద్ర లేచిన గౌరి పాప ఎక్కడ ఉందని భర్తను అడగగా, చంపేసి గోనె సంచిలో పెట్టానని చెప్పాడు. దీంతో గౌరీ సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం ఇచ్చేందుకు బయటకు వెళ్లింది. అదే అదునుగా తీసుకున్న అతను మృతదేహాన్ని సెవెన్ టూంబ్స్ సమీపంలోని  చెత్తకుప్పలో పడేశాడు. ఈ ఘటనపై గౌరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవజాత శిశువు మరణించడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కూతురిని హత్య చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జగత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ వెల్లడించారు. విచారణలో అతను నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు.