calender_icon.png 3 November, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో గోదావరిలో స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతు

03-11-2025 04:17:29 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని మర్రివాడకు చెందిన రవికంటి సాయి (30) అనే యువకుడు సోమవారం ఉదయం గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఈ సంఘటనపై రాష్ట్ర మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేస్తూ, గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమాచారం అందుకున్న వెంటనే మంథని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మంథని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన రవికంటి సాయి ఆచూకీ కోసం గోదావరినదిలో తీవ్రంగా శోధిస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు  గల్లంతైన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పి, భరోసా ఇచ్చారు.